పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : శ్రీ కృష్ణుని అష్టమహిషలు

శ్రీ కృష్ణుని అష్టమహిషలు

శ్రీ కృష్ణుని పట్టపురాణులు 

 అష్టమహిషలు   1రుక్మిణీ దేవి, 2సత్యభామ, 3జాంబవతి, 4మిత్రవింద, 5భద్ర, 6సుదంత, 7కాళింది, 8లక్షణ.



1 రుక్మిణి 

 భీష్మకుని పుత్రిక, రుక్మిణి సందేశాన్ని అందుకొని స్వయంవరం సమయంలో ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకొన్నాడు; 

2 సత్యభామ 

 సత్రాజిత్తు కూతురు, శ్యమంతరమణిని తెచ్చి నిర్దోషిత్వం రుజువు చేసుకొన్న పిమ్మట సత్రాజిత్తు కూతురు నిచ్చాడు; 

3 జాంబవతి 

 జాంబవంతుని పుత్రిక, శ్యంతంకమణికై వచ్చిన జాంబవంతునితో 28 రోజులు యుద్దంచేసి ఓడించి గ్రహించాడు;

4 మిత్రవింద 

 అవంతీ రాకుమారి, మేనత్త కూతురు, ఆమె కోరిక మేర స్వయంవరానికి వచ్చి ఇతర రాజులను ఓడించి చేపట్టాడు; 

5 భద్ర 

 వసుదేవుని చెల్లెలు శ్రుతకీర్తి కూతురు; 

6 సుదంత అను నాగ్నజిత్తి 

 నగ్నిజిత్తుని పుత్రిక, స్వయంవరంలో ఏడుఎద్దులను బంధించి చేపట్టాడు; 

7 కాళింది 

 సూర్య పుత్రిక, యమునా సైకతస్థలినుంచి తీసుకొచ్చి వివాహ మాడాడు; 

8 లక్షణ 

 మద్రదేశ రాకుమారి, స్వయంవరంలో మత్యయంత్రం బేధించి చేపట్టాడు.