బాల ద్విపద భాగవతం : భాగం - 5-401-500
401
దానిచే నగ్గోపతనయుల నొంపఁ
గానోపితిరయేని కలదు సూ మెచ్చు”
అని ప్రధానునిఁ జూచి యనియె, “మీనేర్పు
లెనయంగఁ జనుదెంచు నీచతుర్దశిని
తలపెట్టుఁ డొక్క కోదండ యాగంబు
నలఘు తద్దర్శనవ్యాజంబు నెఱపి
వారల రావించి వడిమీరఁ ద్రుంచి
ధీరత నవ్వసుదేవు నణంచి
ఉగ్రసేనుని కాజ్ఞ యొనరించి తక్కు
నగ్రగణ్యతఁ గల్గు యదువులం దఱిమి
హితులు మీరలె కాఁగ నేలుదు భూమి
చతురాత్ముఁడగు జరాసంధుండు మెచ్చ”
అనుచు నక్రూరుని నాదటం బిలిచి
“జననుత! నందవ్రజమునకు నీవు
రయమున నరిగి యా రామునిం గృష్ణు
నయకరంబగు ధనుర్యాగంబుఁ జూచు
నెసమునం దోఁదెమ్ము నీకల్గు నేర్పు
విపులమై మించు నా వేరంబు
హయరూపమున వచ్చిన కేశి యును దానవుని శ్రీకృష్ణుఁడు సంహరించుట
అనియంతిపురమున కరిగె, నాకేశి
దనుజుండు నంత నందవ్రజంబునకును
[50] దీరు”
411
హయరూపమున నేగి యలజడిసేయ
రయమున వాని గర్వము చూచి శౌరి
కఱవ వచ్చెడి నోరఁ గరమిడిత్రిప్పి
యఱిముఱి చెఱిచిన నతఁడుర్వి వ్రాలె
నారదుఁడు శ్రీ కృష్ణునిఁ బ్రస్తుతి చేయుట
ఆవెళ నారదుం డరుదెంచి కృష్ణుఁ
బావనతరమూర్తిఁ బ్రస్తుతి సేసె
“కంసుండు నీ చేతఁ గడముట్టు మఱియుఁ
గంససన్నిభులు పెక్కండ్రణంగుదురు
చనియెడు నీ చేత జగతిభారంబు”
ననిపల్కి ప్రణమిల్లి యరిగె నిజేచ్ఛ
మయాత్ముజుఁడైన వ్యోముఁడను వాఁడు గోపకులను మోసముతో హరించి కొండ గుహలో దాచగా శ్రీకృష్ణుఁడా గుహద్వారమును ఛేదించి గోపకుల విడిపించుట
తగరుల[51] మంచుఁ గొందఱు మూఁగియుండ
తగఁగొంద ఱందు మందలవారుఁ గాఁగ
చోరకులై గోపసూనులుఁ గొంద
రారసి తగరుల హరియించి కొండ్రు
యీరీతి విహరించునెడఁ గృష్ణుఁ జూచి
దారుణాకృతి మయాత్మజుఁడు వ్యోముండు
ఆయెడఁ జోరులందడఁగి యా తగరు
లైయున్న బాలుర హరిఁ గనుంగొనఁగ
కొనిచని చని యొక్క గుహ నిడి వాత[52]
ఘనగండ శైలంబుఁ గదియించి మఱియు
[51] తగరు- పొట్టేలు
[52] వాత- ముఖద్వారం
421
యేతెంచు తఱి వాని హింసించె శౌరి
చేతుల కొలఁదియుం జెలరేఁగి మోది
ఘనశిల వోఁదన్ని గవి[53] లోన నున్న
తనగోపకులఁ దెచ్చెఁ దదనంతరంబ
అక్రూరుఁడు హలరామకృష్ణులను మధురకుఁ దోడ్కొని పోవుటకై నంద వ్రజమున కేతెంచుట
నరనాథ యా మరునాఁటి సాయమున
గురుబుద్ధి యైన యక్రూరుఁ డార్యుండు
హరికిని లీల నిలాస్పదం బగుచు
సరిలేని నంద వ్రజమున కేతెంచి
బలకృష్ణులకు భక్తిఁ బ్రణమిల్లి వారి
కలపు కోలునకు వెగ్గళముగాఁ[54] బొదలి
నందుని యింట నన్నము భుజియించి
సందడి గొనునట్టి సల్లాపసరణి
తనుఁగంసుఁ డనిపిన తలఁపెల్లఁ దెలుప
వినియాత్మలోన గోవిందుండు మెచ్చి
నందాదులకుఁ బయనంబెఱింగింప
నందాదులునుఁ బయనంబయినంత
వేఁకువ లేచి పూవిల్తుని చేతఁ
గాఁకలఁబడు గోపికల నూరడించి
అలవడ నక్రూరునరదంబు నెక్కి
బలుఁడునుం దాను సంభ్రమముతో శౌరి
[53] గవి- గుహ
[54] వెగ్గళము- అత్యధికము
431
పదరకఁ[55] గదిసె గోపకులు సేవింపఁ
గదలె నమ్మధురకుం గని వేల్పు లలర
యమునానదిలో స్నానమాడుటకు వెళ్ళిన యక్రూరునికి శ్రీకృష్ణుఁడు తన దివ్యదర్శన మనుగ్రహించి జ్ఞానోదయము కల్గించుట
తెరువున యమునలో తియ్యని నీరు
పరితోషమున నాని[56] బలకృష్ణు లచట
నిలిపిన రథముపై నెఱిఁ బవ్వళించి
రలసిన పగిది నేత్రాబ్జముల్ మూసి
రాలోన నక్రూరుఁ డానది యంద
నాలస్యగతిఁ దీర్థమాడుచు మునిఁగి
యందులో బలయుక్తుఁడగు కృష్ణుఁ గాంచి
యందంద నెఱగంది యప్పుడ లేచి
రథముపై నున్న యారామకేశవులఁ
బ్రథిక వృత్తులఁ గాంచి భ్రమసె తోడుతనె
మునిఁగి క్రమ్మఱ లోన మోదంబుతోడ
ఘనవేష పర్యంకుఁ గమ్ర వత్సాంకు
శంఖచక్ర గదాబ్జసహితోరు హస్తు
శంఖసన్నిభ కంఠసమమణి శస్తు
సకల భూషణ మణిచ్ఛాయాభిరాము
సకుశ మనోహర జలధర శ్యాము
దరిసించి పెక్కు చందముల నుతించె
హరియు నంతర్హితుండయ్యె నా క్షణమ
[55] పదరక- త్వరపడక
[56] ఆను- భక్షించు, త్రాగు
441
అంతఁదీర్థంబాడి యరుదెంచు భాగ్య
వంతునక్రూరు నవ్వనమాలి చూచి,
“నీటిలోఁ దడవుంటి నీకెద్ది యైనఁ
బాటిల్లెనో కానఁబడి విశేషంబు”
నావుఁడు “నీ దర్శనంబె విశేష
మేవంక” నని, నుతియించిన మెచ్చి
బలరామకృష్ణులు అక్రూరునితో మధురాపురి ప్రవేశించుట
అతఁడును బలుఁడుఁ దో- నరుదేరఁ గీర్తి
రతుఁడు కృష్ణుఁడు మధురాపురంబునకు
నడచి యచ్చేరువ నందాదు లెల్ల
నొడికంబుగా[57] మున్నె యొనరించి యున్న
ఆవాసమున నిల్చె, నక్రూరుఁ డంత
దావీడు సొచ్చి మోదమునఁ గంసునకు
హరిరాక యెఱిఁగించె హరియును నంత
పురిఁజూచు వేడుక పొంపిరివోవ
బలరామకృష్ణులు మధురానగర శోభను వీక్షించుచు దుండగుల శిక్షించి భక్తుల ననుగ్రహించుట
బలయుక్తుఁ డగుచు గోపకు లిరుమేల
మలయంగఁ బురి సొచ్చి మాపటి వేళ
వలువ లొసంగక వైపరీత్యములు
వలికెడు రజకునిఁ బౌరులు చూడ
దండించి వానిచే ధవళవస్త్రములు
బలుఁడునుఁ దాసు గోపకులునుం దాల్చి
[57] ఒడికము- యుక్తము
451
ఆనతుం డగుచు వాయకుఁ డొప్పగించు
నానామణీ భూషణంబులుఁ దాల్చి
అరుదుగాఁగ సుదాము నాలయంబునకు
నరిగి వాఁడొసఁగు మాల్యములు ధరించి
అందమేదిన కుబ్జయగు కాంతఁ దనకు
గంధ మిచ్చుటకుఁ జక్కదనం బొసంగి
కినుకమై జను లెఱింగించు మార్గమునఁ
జని యా ధనుర్యాగశాలవే సొచ్చి
కంసుని ధనుర్యాగశాలనుఁ బ్రవేశించిన శ్రీకృష్ణుఁడు ధనుస్సును నెక్కు పెట్టి విఱచుట
అచటఁ బూజించిన యాకంసహతకు
రుచిర చాపంబు నిరూఢియై నెత్తి
అవలీలఁగాఁగ సజ్యము సేసి విఱిచె
రవమున నహితాంతరంగముల్ బెదర
కలఁగి యడ్డము వచ్చు కావలి వారిఁ
దొలఁగక యా వింటితునుకల చేతఁ
బడమోది కృష్ణుఁ డాబలుఁడునుం దాను
వడినేగి రాత్మనివాసంబు కడకు
సూర్యాస్తమయ, చంద్రోదయ వర్ణనము
యిట్టిశోభన వార్త యెఱిఁగించఁ బోవు
నట్టికైవడి భానుఁ డపరాబ్ధిఁ గ్రుంకె
ఆకంసువదన మిట్టగు న్ననయటుల
జోకఁదప్పుచుఁ దమ్మి సుఱ్ఱన స్రుక్కె
461
శౌరికంసునిఁ ద్రుంచి సయ్యనఁ గొంత
భారంబుఁ దీర్చు నిప్పటికని పొడము
నిలరాగ మటు మీదికెగసి దీపించు
నలవునం జరమ సంధ్యారాగ మలరె
వనట లీ గతి కంసవనితల కొదవు
ననుగతి బలువయ్యెనంధకారంబు
కంసుహారపు మౌక్తికము వెల్లి శౌరి
హింసించు వేళఁ చెల్లీరీతిఁ జెదరు
ననితెల్పునట్టి యొయ్యారంబు మెఱయఁ
గనుపట్టెఁ దారకాగణములు మింట
అలసిన కృష్ణుపై నాత్మకరంబు
మెలయింతు నిపుడ నీ యూహించు నటుల
నుదయించె నమృతమయూఖుండు మేన
నొదవిన కెం పొయ్య నొయ్యన జార
కంసుని కంటికి కునుకు పట్టకనే రాత్రి తెల్లవారుట
ఆవేళ బలకృష్ణు లచ్చోట నందు
నావాసమునఁ బాలునన్నంబుఁ గుడిచి
యుండిరి కంసుండు నొదవెనే యిట్లు
గండంబనుచు నిద్రఁగానక యుండె
సూర్యోదయ వర్ణనము
హరికిఁగాఁ గలుగు జయంబు సూచించు
నరుదైన మరుని కాహళములో యనఁగ
471
కుక్కుట గణము మిక్కుటముగా నిక్కి
కొక్కరకో యని కూయంగఁ దొణఁగె
యిదియిట్టె యుదయించు, నినుని చందమున
యదువుల కభ్యుదయముగల్గు నిపుడ
యనిచూపి చెప్పంగనరుదెంచు కరణిఁ
గనుపట్టె రుచి యెక్కఁగడు వేగుఁజుక్క[58]
శౌరికంసుని ద్రుంచుసన్నాహమెల్ల
వారక కనుఁగొనవలయు నివ్వేళ
ననియున్నతప్రదేశారోహణంబు
నొనరించు గతి భానుఁడుదయాద్రి యెక్కె
కుహనా ప్రయుక్తితోఁ గంసుఁడు కొలువుఁదీర్చుట
రాజేంద్ర! యీ రీతి రవి యుదయింప
రాజితం బగునట్టి రంగగేహమున
కొలువుండి కంసుండు కుహనాప్రయుక్తిఁ
దలపెట్టె మల్లయుద్ధప్రసంగంబు
మండలేశ్వరులు నమాత్యులుం గొలిచి
యుండిరా కంసుని యుభయ పార్శ్వముల
పొసఁగ నందాది గోపకు లుపాయనము
లొసఁగి సేవించుచునుండి రచ్చోట
మొగిఁగూడి చాణూరముష్టిక ముఖ్యు
లగుజెట్లు సన్నాహులైవచ్చునంత
[58] వేగుచుక్క- ఉదయం శుక్రుడు ఉదయించి కనబడు కాంతివంతమైన చుక్క
శ్రీ కృష్ణుఁడు కువలయాపీడమను మదగజమును దానిని తనపై యుసిఁగొల్పిన నంబష్ఠుని సంహరించుట
481
నగణిత ప్రహత వాద్యరవంబు మించె
గగనంబు ముట్టునా గజిబిజి వినుచు
రంగంబు చొరబాఱు రామునిం గృష్ణుఁ
భంగించు బుద్ధి నంబష్ఠుండు చూచి
కువలయాపీడంబుఁగొన వ్రేళ్ళఁ బొడిచి
కవియించెఁ గృష్ణుపైఁ గఠినాత్ముడగుచు
వొడుపుఁ దప్పించుక యొయ్యన కాళ్ళ
నడుమఁ గృష్ణుండు విన్నాణియై వెడలి
తోఁకవట్టి కుదించి తూరి యెదిర్చి
యాఁకలేక గజంబు నవనిపై వ్రాల్చె
తనరు నమ్మద హస్తిదంతంబె తిగిచి
కొనిమోది యంబష్ఠకుని[59] నుర్వి వ్రాల్చె
యీరీతి నచట నయ్యిభము నంబష్ఠుఁ
బౌరుషంబున వ్రాల్చి ప్రబలుఁడై శౌరి
లక్షించి రంగస్థలమున కేగుటయు
నీక్షించి చాణూరుఁ డిట్లని పలికె
చాణూరుఁడు తన రాజైన కంసుని వినోదార్థము శ్రీ కృష్ణుని మల్ల యుద్ధమునకై నాహ్వానించుట
“గోపనందన! యిట్టి కొలువులోఁ గంస
భూపతి మదినింపు పొంపిరి వోవ
వొనరింతమే బాహుయుద్ధంబు, నిన్ను
జనులెన్నుదురు భుజసత్వంబు నందు
[59] అబష్ఠకుడు- మావటి, ఏనుగును పాలించు చాకలివాడు
491
తొలఁగక నీవు నాతోఁబెనంగుటకు
నెలకొన్న కడిమిమైనిలిచితి వేని
రాముని తోడఁ బోరామి దీపించ
మాముష్టికుఁడు నిల్చుమల్లయుద్ధమున”
పల్లెటూరి గొల్లపిల్లవారు మల్లయుద్ధ మహావీరులిద్దఱితో నెట్లు పోరాడగలరని గోవిందుఁడు నేర్పుగా బదులు చెప్పుట
అనుటయు గోవిందుఁడలవోక నవ్వు
లెనయఁ జాణూరునివేపు మైఁ జూచి
“వనచారులము, గొల్లవారి బాలకుల
మొనర మీతోఁ బోరనోపుదు మెటుల?
అయినను మానేర్చునటులఁ జూపఱకు
ప్రియముఁ గావింతు మోపిక” నని పలికి
అన్నయుం దాను రయంబులో నలర
సన్నద్ధులై రెల్లజనులర్థిఁ జాడ
జలజలోచనుఁ డంతఁ జాణూరుఁ గదిసె
బలుఁడు ముష్టికునిఁ జొప్పడ నెదుర్పడియె
శ్రీకృష్ణ చాణూరులు మల్లయుద్ధము సేయుట
హరియుఁ జాణూరుండు నవ్వేళ గిరియు
గిరియునుం దాఁకినక్రియ లావు మెఱయ
వొడియుచు జడియుచు నొయ్యన నొంపఁ
గడఁగుచు నడఁగుచుఁ గరకరి నఱిమి
పదరక చెరదక బహు మండలములఁ
బ్రిదులక యదలక పెను మచ్చరముల