పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదాగమనంబు

  •  
  •  
  •  

1-86-సీ.

న చేతి వల్లకీతంత్రీ స్వనంబున-
తత నారాయణబ్ద మొప్ప,
నానన సంభూత రిగీతరవ సుధా-
ధారల యోగీంద్రతులు సొక్కఁ,
పిల జటాభార కాంతిపుంజంబుల-
దిశలు ప్రభాత దీధితి వహింపఁ,
నులగ్న తులసికా దామగంధంబులు-
గనాంతరాళంబు ప్పికొనఁగ,

1-86.1-ఆ.

చ్చె మింటనుండి వాసవీనందను
డకు మాటలాడఁ డఁకతోడ,
ద్రవిమలకీర్తిపారగుఁ, డారూఢ
యవిశారదుండు, నారదుండు.

1-87-క.

నియెన్ నారదుఁ డంతన్
వియైక విలాసు, నిగమ విభజన విద్యా
నితోల్లాసున్, భవదుః
నిరాసున్, గురుమనోవికాసున్, వ్యాసున్.

1-88-వ.

ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌ క్రమంబునం బూజించిన, నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేల మీటుచు నిట్లనియె.

1-89-ఉ.

"ధావు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి
జ్ఞావు, కామముఖ్యరిపుట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని
ర్ణేవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కారుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!""

1-90-వ.

అనినఁ బారాశర్యుం డిట్లనియె.

1-91-క.

"పుట్టితి వజు తనువునఁ, జే
ట్టితివి పురాణపురుషు జనము, పదముల్
మెట్టితివి దిక్కులం, దుది
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!

1-92-వ.

అదియునుం గాక, నీవు సూర్యునిభంగి మూఁడు లోకములం జరింతువు; వాయువు పగిది నఖిలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞుండ వగుటం జేసి.

1-93-క.

నీ కెఱుఁగరాని ధర్మము
లోములను లేదు, బహువిలోకివి నీవున్,
నా కొఱఁత యెట్టి దంతయు
నాకున్ వివరింపవయ్య నారద! కరుణన్.""

1-94-వ.

అనిన నారదుం డిట్లనియె.

1-95-ఉ.

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుక గాని విష్ణు కథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక; నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!

1-96-మ.

రినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు; శ్రీ
రినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు, శ్రీ
మై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.

1-97-మ.

శబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
రిత్యాగము సేయుఁ; గావున హరిన్ భావించుచుం, బాడుచున్,
ముల్ సేయుచు, వీనులన్ వినుచు, నశ్రాంతంబు గీర్తించుచుం,
సుల్ సాధులు ధన్యులౌదురుగదా త్త్వజ్ఞ! చింతింపుమా.

1-98-వ.

మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికం బైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థకంబులు; గావున,మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకల దిగంత ధవళకీర్తివి, సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబుకొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులంజేసి పృథగ్దర్శనుం డైనవాని మతి పెనుగాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను నావ చందంబున నెలవు సేర నేరదు; కామ్యకర్మంబు లందు రాగంబు గల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండ వగు నీవు వగచుట తగ; దది యెట్టు లనిన, వార లదియే ధర్మం బని జుగుప్సితంబు లగు కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు; గావున, బుద్ధి మోహంబు జనియింపక తత్వజ్ఞుండవై వ్యధా వియోగంబు సేయు"మని మఱియు నిట్లనియె.

1-99-చ.

"ఱిఁగెడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు; గుణానురక్తుఁడై
తెకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగ చెప్పవే.

1-100-చ.

కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
నివడి సేవసేసి పరిపాకముఁ వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన, మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్.

1-101-వ.

అదిగావున నెఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయం దగుఁ; గాలక్రమంబున సుఖదుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు; దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ దిరుగుచున్న జీవులకు నెయ్యది వొందరా దట్టి మేలు సిద్ధించుకొఱకు హరిసేవ సేయవలయు; హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కండు; క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తి రసవశీకృతుం డయి విడువ నిచ్చగింపఁడు; మఱియును.

1-102-సీ.

విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను-
వేఱేమియును లేదు విశ్వమునకు
వవృద్ధిలయము లా రమేశుచే నగు-
నీ వెఱుంగుదు కాదె నీ ముఖమున
నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ-
భువన భద్రమునకై పుట్టినట్టి
రికళాజాతుండ ని విచారింపుము,-
మణతో హరిపరాక్రమము లెల్ల

1-102.1-ఆ.

వినుతిసేయు మీవు; వినికియుఁ, జదువును,
దాన, మతుల నయముఁ, పము, ధృతియుఁ,
లిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ
మలనాభుఁ బొగడఁ లిగెనేని.