పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : యాదవుల కుశలం బడుగుట

  •  
  •  
  •  

1-346-క.

ఖేమున నింద్రసూనుఁడు
యావపురినుండి వచ్చి గ్రజుఁ గని త
త్పాముల నయనసలిలో
త్పాకుఁడై పడియె దీనుభంగి నరేంద్రా!

1-347-క.

ల్లటిలిన యుల్లముతోఁ
ల్లడపడుచున్న పిన్నమ్మునిఁ గని వె
ల్వెల్లనగు మొగముతో జను
లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్.

1-348-సీ.

""మాతామహుండైన నశూరుఁ డున్నాడె?-
మంగళమే మనమాతులునకు?
మోదమే నలుగురు ముగురు మేనత్తల?-
కానందమే వారి యాత్మజులకు?
క్రూర కృతవర్మ లాయు స్సమేతులే?-
జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు?
ల్యాణయుక్తులే ద సారణాదులు-
మాధవుతమ్ములు మానధనులు?

1-348.1-తే.

నందమే మనసత్యకనందనునకు?
ద్రమే శంబరాసురభంజనునకుఁ?
గుశలమే బాణదనుజేంద్రకూఁతుపతికి?
ర్షమే పార్థ! ముసలికి లికి బలికి?

1-349-వ.

మఱియు నంధక, యదు, భోజ, దశార్హ, వృష్ణి, సాత్వతులు మొదలయిన యదువంశ వీరులును, హరికుమారులైన సాంబ సుషేణప్రముఖులును, నారాయణానుచరులైన యుద్ధవాదులును, గృష్ణసహచరులైన సునంద నందాదులును, సుఖానందులే?"యని, యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె.

1-350-సీ.

""వైకుంఠవాసుల డువున నెవ్వని-
లమున నానందరితు లగుచు
వెఱవక యాదవ వీరులు వర్తింతు?-
మరులు గొలువుండు ట్టి కొలువు
వికె నాకర్షించి రణసేవకులైన-
బంధుమిత్రాదుల పాదయుగము
నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీఁద?-
జ్రంబు జళిపించి వ్రాలువాని

1-350.1-తే.

ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి
మృతజలములఁ బోషింప లరు పారి
జాత మెవ్వఁడు గొనివచ్చి త్యభామ
కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె?

1-351-శా.

న్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా
న్నానీకశరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ
న్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్యపీఠంబునం
దున్నాఁడా బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్?

1-352-క.

రామకేశవులకును
సారామలభక్తి నీవు లుపుదువు గదా;
గారాములు సేయుదురా
పోరాముల బంధు లెల్ల ప్రొద్దు? జితారీ !

1-353-శా.

మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో,
న్నాహంబునఁ గాలకేయుల ననిం క్కాడుచోఁ, బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ,
న్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా ల్యాణమే చక్రికిన్?

1-354-వ.

అదియునుం గాక.

1-355-క.

డితివో శత్రువులకు,
నాడితివో సాధు దూషణాలాపములం;
గూడితివో పరసతులను,
వీడితివో మానధనము వీరుల నడుమన్;

1-356-క.

ప్పితివో యిచ్చెదనని;
చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్
దెప్పితివో; శరణార్థుల
రొప్పితివో ద్విజులఁ, బసుల, రోగుల, సతులన్;

1-357-క.

డిచితివో భూసురులనుఁ;
గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్;""

1-358-వ.

అని పలికినం గన్నీరు కరతలంబునం దుడిచికొనుచు గద్గదస్వరంబున మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగిడించుచు నర్జునుం డన్న కిట్లనియె.