పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు దిగ్విజయయాత్ర

  •  
  •  
  •  

1-391-వ.

అంత నటం బరీక్షిత్కుమారుండు జాతకర్మవిదులైన కోవిదులు సెప్పిన చందంబున భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవత శేఖరుండై ధరణీపాలనంబు సేయుచు నుత్తరుని పుత్రిక నిరావతి యను మత్తకాశినిం బెండ్లి యయి, జనమేజయ ప్రముఖులైన నలువురు గొడుకుల నుత్పాదించి, గంగాపులినతలంబునఁ గృపాచార్యుండు గురుత్వంబు సేయ యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షించుచు భూరిదక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయ కాలంబున గోమిథునంబుఁ దన్ను శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండును నగు కలిం బట్టి నిగ్రహించె"నని చెప్పిన, శౌనకుండు పౌరాణికున కిట్లనియె.

1-392-క.

""భూరరూపుఁడు శూద్రుఁడు
గోవుం దా నేల తన్నెఁ, గోరి పరీక్షి
ద్భూరుఁడు దిశల గెలుచుచు
నే విధిఁ గలి నిగ్రహించె, నెఱిఁగింపఁ గదే.

1-393-మ.

విందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్దిన్ విలంఘించి, దు
ర్నవార్తాకథనప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి, వా
ముల్ వ్యర్థతఁ దోచుచుండఁ జన దీ సంసారమోహంబునన్.

1-394-సీ.

నుట నిత్యము గాదు రణంబు నిజ మని-
యెఱిఁగి మోక్షస్థితి నిచ్చగించు
ల్పాయువు లగు మా న్యదుర్జన చరి-
త్రములోలిఁ గర్ణరంధ్రములఁ బెట్టి
బంగారు వంటి యీ బ్రతికెడు కాలంబుఁ-
బోనాడఁ గానేల పుణ్యచరిత!
మాధవపదపద్మ కరందపానంబు-
సేయింపవే యేము సేయునట్టి

1-394.1-ఆ.

త్రయాగమునకు న్మునీంద్రులు సీర
వాఁడె దండధరుఁడు చ్చెఁ జూడు
చంపఁ డొకనినైన న్న మయ్యెడుదాక,
వినుచు నుండుఁ దగిలి విష్ణుకథలు.

1-395-క.

మందునకు, మందబుద్ధికి,
మందాయువునకు, నిరర్థమార్గునకును, గో
వించరణారవింద మ
రంము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్.""

1-396-వ.

అని శౌనకుండు వలికిన సూతుం డిట్లనియెఁ ”బరీక్షిన్నరేంద్రుండు నిజవాహినీసందోహ సురక్షితంబగు కురుజాంగలదేశంబునం గలి ప్రవేశంబు నాకర్ణించి, యుద్ధకుతూహలత నంగీకరించి, యొక్కనాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని, నీల నీరద నిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబును నైన రథంబు నారోహణంబు సేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుఁగ రథ, కరి, తురంగమ, సుభట, సంఘటితంబగు వాహినీచక్రంబు నిర్వక్రంబుగం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబు లయిన యిలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారతవర్షంబులు, నుత్తరకురు దేశంబులును, జయించి, పుష్కల ధన ప్రదానపూర్వికలగు సపర్యల నభ్యర్చితుండై తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు, మంగళ పాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణించుచుఁ, బాఠకపఠిత పద్యంబుల వలనం బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య, సఖ్య, సాచివ్య, సభాపతిత్వ, వీరాసనత్వ, దూతభావాది కర్మంబులు, నశ్వత్థామాస్త్ర తేజంబు వలనఁ దన్ను రక్షించుటయు, యాదవ పాండవు లందలి స్నేహానుబంధంబును, వారలకుఁ గలిగిన భగవద్భక్తి విశేషంబును విని, విశ్వంభరుని భక్త వాత్సల్యంబునకు నాశ్చర్యంబు నొందుచు, వందిబృందంబులకు న్మహార్ఘంబులగు హారాంబరాభరణాది సందోహంబుల నొసంగుచుఁ, బద్మనాభ పాద పద్మభజనపరతంత్ర పవిత్ర మానసుండై యుండె; నయ్యెడ వృషభరూపంబున నేక పాదంబున సంచరించు ధర్మదేవుండు దన సమీపంబున లేఁగలేని లేఁగటికుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు గోరూపయై యున్న ధాత్రి కిట్లనియె.