పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-473-వ.

ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి.

1-474-ఉ.

""క వింటికోపున మృతోరగముం గొని వచ్చి మాఱు మా
టాకయున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డినఁ నైనఁ జచ్చుఁ బో
యేవ నాఁడు తక్షకఫణీంద్ర విషానల హేతి సంహతిన్.""

1-475-వ.

అని శమీకమహామునికుమారుం డయిన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుం జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి.

1-476-క.

""ఇయ్యెడ నీ కంఠమునను
నియ్యురగ కళేబరంబు నిటు వైచిన యా
య్య నిఁక నేమి సేయుదు
నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకుఁ దండ్రీ!

1-477-శా.

ప్రారంభంబున వేఁట వచ్చి ధరణీపాలుండు, మా తండ్రిపై
నేరం బేమియు లేక సర్పశవమున్ నేఁ డుగ్రుఁడై వైచినాఁ
డీరీతిన్ ఫణి గ్రమ్మఱన్ బ్రతుకునో? హింసించునో కోఱలన్?
రారే తాపసులార! దీనిఁ దివరే, క్షింపరే, మ్రొక్కెదన్.""

1-478-వ.

అని వెఱపున సర్పంబుఁ దిగుచు నేర్పు లేక యెలుంగెత్తి యేడ్చుచున్న కుమారకు రోదనధ్వని విని, యాంగిరసుం డయిన శమీకుండు సమాధి సాలించి, మెల్లన కన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు నీక్షించి, తీసి పాఱవైచి; కుమారకుం జూచి.

1-479-క.

""ఏ కీడు నాచరింపము
లోకులకున్ మనము సర్వలోక సములమున్
శోకింప నేల పుత్రక
కాకోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్.""

1-480-వ.

అని యడిగినఁ దండ్రికిఁ గొడుకు, రాజు వచ్చి సర్పంబు వైచుటయుం దాను శపించుటయును వినిపించిన, నమ్ముని తన దివ్యజ్ఞానంబున నమ్మానవేంద్రుండు పరీక్షిన్నరేంద్రుం డని యెఱింగి, కొడుకువలన సంతసింపక యిట్లనియె.

1-481-క.

""బెట్టిదమగు శాపమునకు
ట్టపు ద్రోహంబు గాదు, రణీకాంతుం
ట్టా! యేల శపించితి
ట్టీ! తక్షకవిషాగ్ని పాలగు మనుచున్.

1-482-ఆ.

ల్లి కడుపులోన గ్ధుడై క్రమ్మఱఁ
మలనాభు కరుణఁ లిగినాఁడు;
లిమి గలిగి ప్రజలఁ బాలించుచున్నాడు;
దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె?

1-483-ఉ.

కారి లేని గొఱ్ఱియల కైవడిఁ గంటక చోర కోటిచే
నేఱి యున్నదీ భువన మీశుఁడు గృష్ణుఁడు లేమి నిట్టిచో,
భూరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ, జెల్లరే!
యీ రిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల? బాలకా!

1-484-సీ.

పాపంబు నీచేత ప్రాపించె మన; కింక-
రాజు నశించిన రాజ్యమందు
లవంతుఁ డగువాఁడు లహీను పశు, దార,-
య, సువర్ణాదుల పహరించు;
జార చోరాదులు సంచరింతురు; ప్రజ-
న్యోన్య కలహంబు తిశయిల్లు;
వైదికంబై యున్న ర్ణాశ్రమాచార-
ర్మ మించుక లేక ప్పిపోవు;

1-484.1-ఆ.

నంతమీఁద లోకు ర్థకామంబులఁ
గిలి సంచరింప, రణి నెల్ల
ర్ణసంకరములు చ్చును మర్కట
సామేయ కులము మేరఁ బుత్ర!

1-485-ఉ.

భాతవంశజుం, బరమభాగవతున్, హయమేధయాజి, నా
చాపరున్, మహానయవిశారదు, రాజకులైకభూషణున్,
నీము గోరి నేఁడు మన నేలకు వచ్చిన;యర్థి భక్తి స
త్కాము సేసి పంపఁ జనుఁ గాక శపింపఁగ నీకు ధర్మమే?

1-486-క.

భూతికి నిరపరాధమ
శాము దా నిచ్చె బుద్ధి చాపలమున మా
పాపఁడు; వీఁ డొనరించిన
పాము దొలఁగింపు కృష్ణ! రమేశ! హరీ!

1-487-క.

పొడిచినఁ, దిట్టినఁ, గొట్టినఁ,
డుచుందురు గాని పరమభాగవతులు; దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ
గొడుకా! విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్.

1-488-క.

చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెకొనిన నైన నాత్మకు
నొయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్.""

1-489-వ.

అని యిట్లు శమీకమహామునీంద్రుండు గ్రమ్మఱింప శక్తి లేని కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొంది, తన శిష్యు నొక మునికుమారునిం బిలిచి, యేతద్వృత్తాంతం బంతయు రాజున కెఱింగించి రమ్మని పంచె; నంత నా యభిమన్యుపుత్రుండు శమీకముని శిష్యునివలన శాపవృత్తాంతంబు విని కామక్రోధాది విషయాసక్తుండగు తనకుం దక్షకవిషాగ్ని విరక్తి బీజం బగు; ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున.

1-490-ఉ.

""టికి వేఁట వోయితి మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి? నేఁ
డేటికిఁ బాపసాహసము లీ క్రియఁ జేసితి? దైవయోగమున్
దాఁటఁగ రాదు, వేగిరమ థ్యము గీడు జనించు ఘోరమై.

1-491-ఉ.

పాము విషాగ్నికీలలనుఁ బ్రాణము లేగిఁన నేఁగుఁగాక, యీ
భూమియు రాజ్యభోగములుఁ బోయిన నిప్పుడ పోవుఁగాక, సౌ
దానిఁ బోలు జీవనము థ్యముగాఁ దలపోసి యింక నే
నేని మాఱు దిట్టుదు మునీంద్రకుమారకు దుర్నివారకున్.

1-492-ఆ.

రాజ ననుచుఁ బోయి రాజ్యగర్వంబున
నముకొఱకు వారి నము సొచ్చి
దందశూక శవముఁ దండ్రిపై వైచినఁ
బొలియఁ దిట్ట కేల పోవు సుతుఁడు?

1-493-క.

గోవులకును, బ్రాహ్మణులకు,
దేతలకు నెల్ల ప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాపమానస
మే విధమునఁ బుట్టకుండ, నే వారింతున్,""

1-494-వ.

అని వితర్కించె.

1-495-క.

దామోదరపదభక్తిం
గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్
భూమీశుఁ డలుగఁ డయ్యెను
సార్థ్యము గలిగి దోషసంగిన్ శృంగిన్.

1-496-వ.

అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబు దక్షకుండు విని యెడరు వేచి యుండె; నిటఁ దక్షకవ్యాళవిషానలజ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున మరణం బని యెఱింగిన వాఁడు గావున, భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబు లని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించుకొని.