పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకుని మోక్షోపాయం బడుగట

  •  
  •  
  •  

1-526-సీ.

వ్యక్తమార్గుండవైన నీ దర్శన-
మాఱడి పోనేర; భిమతార్థ
సిద్ధి గావించుట సిద్ధంబు; నే డెల్లి-
దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన? నేమి జపించిన?-
నేమి గావించిన? నేమి వినిన?
నేమి సేవించిన? నెన్నఁడు సంసార-
ద్ధతిఁ బాసిన దవి గలుగు,

1-526.1-తే.

నుండు మనరాదు; గురుఁడవు, యోగివిభుఁడ,
వావుఁ బిదికిన తడ వెంత యంత సేపు
గాని యొక దెస నుండవు, రుణతోడఁ
జెప్పవే తండ్రి! ముక్తికిఁ జేరు తెరువు."

1-527-వ.

అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె"నని చెప్పి.