పరిశోధనలు : భాగవత రత్న పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్, తెలంగాణా, ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538.
సింగపూరు,
25-03-2025.
సా.శ. 2025వ (విశ్వావసు నామ) సంవత్సరానికి భాగవత రత్న పురస్కారం కొఱకు దరఖాస్తులకు ఆహ్వానం
దరఖాస్తులు అందుకొనుటకు చివరి తేదీ: 2025-05-30
తెలుగు భాగవత ప్రచార సమితివారు తొమ్మిదవ (9) ఏడాది, 2025 (విశ్వావసు నామ) సంవత్సరానికి గాను భాగవత రత్న పురస్కార ప్రదానం; శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామివారి అనుజ్ఞ ప్రకారం చేయదలచిరి. ఇందునిమిత్తమై, అర్హులైన పరిశోధకులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.. ఎంపికైన పరిశోధకులు పురస్కార పతకము, పురస్కార పత్రములతో సత్కారింపబడుదురు.
నియమాలు :-
*ధరఖాస్తుదారుల వివరాలు 2025, మే 30వ తారీఖు లోపున అందేలా పంపవలెను.
*పిహెచ్. డి. లేదా ఎమ్,ఫిల్ లేదా అటువంటి పట్టా గత పది ఏళ్ళలో పొంది ఉండాలి.
* పరిశోధనా విషయము
(అ) తెలుగులో వచ్చిన భాగవతంపై కాని (ఆ) సహజ కవి పోతనామాత్యులు లేదా వారి రచనలపై కాని తెలుగులో సదరు పట్టా పొంది ఉండాలి.
*సదరు పరిశోధకుని పేరు, స్పష్టమైన సంపర్క వివరాలు, పరిశోధనాశం, సంవత్సరం, గైడు పేరు, విశ్వవిద్యాలయం పేరు సహితముగా ధరఖాస్తు పంపాలి.
*పరిశోధనా పత్రం పిడిఎఫ్ రూపంలో కాని యూనీకోడు లిపి దస్త్రంగా కాని సమర్పించాలి.
*అలా సమర్పించుట, సదరు పరిశోధనా పత్రం తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడులో ప్రచురించుటకు అంగీకారం, అనుమతి ధృవీకరించినట్లే. అట్లుకానిచో, ప్రచురించవలదు అని విస్పష్టంగా తన ధరఖాస్తులో తెలియజేయాలి.
*(vsrao50@gmail.com కు ) /(bhagavatapracharasamiti@gmail.com కు ) కు వేగరి సందేశం రూపంలో దరఖాస్తులను పంపాలి,
*సదరు పరిశోధనా పత్రములపై ఎంపిక మండలి సభ్యులు వారి సూచనలను సమర్పిస్తారు. అధ్యక్షులవారు శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వామివారు అభ్యర్థి నిర్ణయం అనుగ్రహిస్తారు.
* పురస్కార ప్రదానం విషయంలో కాని, జాలగూడులో ప్రచురించు విషయంలో కాని తెలుగు భాగవత ప్రచార సమితిదే తుది నిర్ణయం. ఎట్టి సంప్రదింపులు అనుమతింపబడవు.
- భాగవత గణనాధ్యాయి, ట్రస్టీ - అద్యక్షులు
తెలుగు భాగవత ప్రచార సమితి.