సభలు సమావేశాలు : 2015 సెప్టంబరు, 11 - మియాపూరు
ఇవటూరి శారద గారి ఇంట్లో సౌహార్ద్ర సమావేశం
ఛాయా చిత్రాలు, విశేషాలు
ఎలీన్సు ఎలైటు,
మియాపూర్,హైదరాబాదు
2015- సెప్టెంబర్, 11
1) శ్రీ చంద్రశేఖరుగారిని సత్కరించి నమస్కరిస్తున్న సందర్భం
2) భాగవతం గుండెలుమీద పెట్టుకన్న నామీద శ్రీ చింతా రామకృష్ణా రావు గారు ఆశువుగా పద్యం చెప్తున్నారు
3) శ్రీ రామరోహనరావుగారిని సత్కరించుకుంటున్న సందర్భం
4) శ్రీ చింతా రామకృష్ణా రావు గారిని సత్కరించుకుంటున్న సందర్భం
5) అయిదుగురం కూర్చుని సరదాగా తెలుగుభాగవతంలోని విషయాలు గురించి చర్చించుకుంటున్నాం. ఎడంప్రక్క ఎర్రచొక్కా వేసుకున్న వారు శ్రీ రామోహనరావు గారు, వారి ప్రక్క వరుసగా శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారు, శ్రీ చింతా రామకృష్ణారావు గారు, శ్రీ చంద్రశేఖరు గారు మరయు ఊలపల్లి సాంబశివరావుగారు
6) శ్రీ అన్నపురెడ్డి గారిని సత్కరించుకున్న సందర్భం
పూజ్యులు, పండితులు, ఆత్మీయ మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, చంద్రశేఖరు గారు, రామమోహనరావుగారు, నేను (భాగవత గణనాధ్యాయి, ఊలపల్లి సాంబశివరావు) 2015-09-11 తారీఖున హైదరాబాదు, మియాపూరు నందలి, మా సోదరి ఇవటూరి శారదా దేవిగారి స్వగృహం (ఎలీన్సు ఎలైటు)లో సమావేశం అయ్యి తెలుగుభాగవతం గురించీ, మరికొన్ని పాండిత్య విషయాలు గురించీ చర్చించుకున్నాం.ఈ సందర్భంలో పిలవగానే హార్దిక సౌహృదయంతో విచ్చేసిన శ్రీ చింతా రామకృష్ణా రావుగారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డిగారు, చంద్రశేఖరు గారు, రామ్మోహనరావు గారులకు మా దంపతులం శాలువాలు కప్పి పండిత సత్కారం చేసి ఆనందించాము. మిత్రులు, కవి వరేణ్యులు, అవధాని, శ్రీ చింతా రామకృష్ణా రావు గారు ప్రేమతో మమ్ముద్దేశించి అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు అల్లి, వినిపించి అలరింపజేశారు. ఆ పద్యాల మాధుర్యం ఆస్వాదించండి. |