ద్విపదభాగవతం - మధురకాండ : కంసుడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపై బోరఁ బంపుట
డింది చాణూరముష్టికులరప్పించి
దందడిఁ బెదవులు దడవుచుఁ బలికె,
“మనమంటపము సొచ్చి మనవిల్లు విఱిచి
మనపట్టపేనుఁగ మడియించి వీరు
మనమీంద వచ్చిరి మహితవిక్రమము,
తనరార మల్లయుద్ధము నేర్పు మెఱసి
పోర మీరిరువురుఁ బొలియించి వేగ
నారాజ్యమును నన్ను నా బంధుజనుల
రక్షించి నాదు సామ్రాజ్యమెంతయును
నక్షయంబుగ నేలు” మని పల్కుటయును;
తివిరి యక్కున దాత తీర్చిన యట్ల
ప్రవిమలంబగు మహాప్రతిమలో యనఁగ
నవయవంబులుగల యద్రులో యనఁగ
iii పవివేయ నాపెడు బలుదిట్టలనఁగ
ముష్టికచాణూరముఖ్యులు నృపతి
యిష్టంబుఁ గని రంగమెల్లఁదారగుచుఁ - 170
గినుకమై బలరామకృష్ణులఁ జేరఁ
జనిమహాధ్వని మల్లచఱచి యిట్లనిరి.