ద్విపదభాగవతం - మధురకాండ : పురస్త్రీలు శ్రీ కృష్ణ బలరాములఁ జూచి వర్ణించుట
సౌధాగ్రముల యందు సదనంబు (లందు)
వీధుల యందును వెఱవొప్ప నిలిచి
సొరిది వారందఱుఁ జూపులు పఱపి; - 20
“ ఈతఁడే, యెలనాగ ఇసుమంతనాఁడు
పూతన (పాల్ ద్రావి) పొరిఁగొన్న వాఁడు,
సకియరో! ఈతఁడే శకటమై వచ్చు
ప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.
ముద్ధియ! ఈతఁడే మొగిఱోలుఁ ద్రోచి
మద్దియ లుడిపిన మహనీయ యశుఁడు.
అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁ జీరి
కొక్కెర రక్కసుఁ గూల్చినవాఁడు.
గోవర్ధనముఁ గేల గొడుగుగాఁ బట్టి.
గోవులఁ దే)ర్చిన గోవిందుఁ డితఁడె.
కొమ్మ! ఈతఁడె పిల్లఁ గ్రోవూది వ్రేతఁ
గొమ్మలఁ గడువెఱ్ఱిఁ గొలిపినవాఁడు.
కాళీయు పడగ లుగ్రతఁ దొక్కి వాని
కాళి * * * * * న పుణ్యుఁ డితఁడె.
************************
************************
************************
************************
పదవిని దండ్రిచేఁ బలమినిఁ గొన్న
యెదిరిని కంసుని యేపుమాయించి
యీతఁడే రాజైన నిల యెల్లఁ బ్రతుకు;
************************
నెలఁత యీతఁడు రోహిణీదేవికొడుకు
బలుఁ డను రక్కసుఁ బరిమార్చి నతఁడు; - 30
************************
మలసి యిద్దఱి విక్రమంబులఁ జూడ
నా రామ కృష్ణులు నా పట్టణంబు,
భూరి సౌఖ్యమ్ముల నుబ్బుచుం బోయి