పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కృష్ణుడు శకటము దన్నుట

  •  
  •  
  •  

10.1-249-వ.

ఆ సమయంబున.

10.1-250-క.

నిదురించిన శిశు వాకొని
కిదుకుచుఁ జనుఁ గోరి కెరలి కిసలయ విలస
న్మృదు చక్రచాపరేఖా
స్ప పదమునఁ దన్నె నొక్క బండిన్ దండిన్.

10.1-251-క.

టము హరి దన్నిన దివి
బ్రటం బై యెగసి యిరుసు రమునఁ గండ్లున్
విటంబుగ నేలంబడె
టా! యని గోపబృంద మాశ్చర్యపడన్.

10.1-252-వ.

అప్పు డందున్న సరసపదార్థంబులు వ్యర్థంబులై నేలంగూలుటం జూచి యశోదానంద ముఖ్యులైన గోపగోపికాజనంబులు పనులు మఱచి పబ్బంబులు మాని యుబ్బుచెడి వెఱపులు ఘనంబులుగ మనంబులందుఁ గదుర.

10.1-253-క.

"మిన్నున కూరక నెగయదు
న్న సమర్థుండు గాఁడు ల్పగతుం డీ
చిన్నికుమారుఁడు తేరే
విన్ననువున నెగసె దీని విధ మెట్టిదియో."

10.1-254-వ.

అని వితర్కించు సమయంబున

10.1-255-క.

"బాకుఁ డాకొని యేడ్చుచు
గా లెత్తినఁ దాఁకి యెగసెఁ గాని శకట మే
మూమున నెగయ" దని య
బ్బాలుని కడ నాడుచుండి లికిరి శిశువుల్.

10.1-256-వ.

ఇట్లు శిశువులు పలికిన పలుకులు విని.

10.1-257-శా.

"బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం
గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ ల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక" యం
చాలాపించుచుఁ బ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.

10.1-258-వ.

అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.

10.1-259-ఆ.

"లసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
న్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!"
నుచుఁ జన్నుఁగుడిపె ర్భకునకు.

10.1-260-వ.

అంత నబ్బాలునిమేన బాలగ్రహంబు సోఁకునుగదా యని శంకించి గోపకు లనేకు లనేక బలి విధానంబులు చేసిరి; బ్రాహ్మణులు దధికుశాక్షతంబుల హోమంబు లాచరించిరి; ఋగ్యజు స్సామ మంత్రంబుల నభిషేచనంబులు చేయించి స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి కొడుకున కభ్యుదయార్థంబు నందుం డలంకరించిన పాఁడిమొదవుల విద్వజ్జనంబుల కిచ్చి వారల యాశీర్వాదంబులు గైకొని ప్రమోదించె” నని చెప్పి శుకుం డిట్లనియె.

10.1-261-క.

"కొడుకు నొకనాడు తొడపై
నిడుకొని ముద్దాడి తల్లి యెలమి నివురుచోఁ
డుదొడ్డ కొండ శిఖరము
డువున వ్రేఁ గయ్యె నతఁడు సుధాధీశా!

10.1-262-క.

రువైన కొడుకు మోవను
వెవిఁడి యిలమీఁదఁ బెట్టి వెఱచి జనని దా
"ధరఁ గావఁ బుట్టిన మహా
పురుషుఁడు గాఁబోలు" ననుచు బుద్ధిఁ దలంచెన్.
తృణావర్తుడు కొనిపోవుట (తరువాతి ఘట్టం)>>>>>>